Monday, January 20, 2025

300 కేజీల గంజాయి పట్టివేత

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పట్టణ శివారు ప్రాంతం 65వ జాతీయ రహదారి పై 300 కేజీల గంజాయిని పట్టుకున్న కంచికచర్ల పోలీసులు…

*కంచికచర్ల పోలీసు స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించిన నందిగామ ఏసిపి రవి కిరణ్…*

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం అటవీ ప్రాంతం నుంచి 300 కేజీల గంజాయిని కొనుగోలు చేసి కారులో ముంబైకి అక్రమంగా తరలిస్తున్నారు ఏసిపి తెలిపారు…

గంజాయిని తరలిస్తున్న వ్యక్తి మహారాష్ట్ర, పూణే జిల్లా సోంగాన్ గ్రామానికి చెందిన శుభం దత్తాత్రే భన్దవాల్కర్ (26) అరెస్టు చేశామని ఏసిపి రవికిరణ్ అన్నారు…

నర్సీపట్నం లో కేజీ గంజాయి 3000 రూపాయలకు కొనుగోలు చేసి ముంబై లో కేజీ సుమారు 10000 రూపాయలకు అమ్ముతున్నారు. గంజాయి 300 కేజీల విలువ 30 లక్షల రూపాయలు విలువ ఉంటుందని ఏసిపి తెలిపారు…

నిందుతుడు దగ్గర నుంచి 300 గంజాయి, కారు,3 సెల్ ఫోన్లు,11500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన నందిగామ ఏసిపి రవికిరణ్…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular