Monday, January 20, 2025

సంగెం: వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎంపిడిఓ,తహసీల్దార్




తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.

గ్రామీణాభివృద్ధి సంస్థ- గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ.
చింతలపల్లి గ్రామంలో ఝాన్సీ లక్ష్మీ బాయి గ్రామ సంఘం ఆధ్వర్యంలో వడ్లకోనుగోలు కేంద్రం ప్రారంభించిన తసీల్దార్ రాజ్ కుమార్ ఎంపీడీఓరవీందర్
సంగెం మండలంలోని చింతలపల్లి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం సెంటర్ ను రైతులు సద్వినియొగం చేసుకోవాలని , తేమ లేకుండా క్లీన్ చేసిన ధాన్యాన్ని మాత్రమే కాంట వేయాలని తసీల్దార్ రాజ్ కుమార్ తెలిపారు, ఎంపీడీఓ రవీందర్ మాట్లాడుతూ వడ్లు కొనుగోలు చేయుటకు కమీటీ సభ్యులు సిద్దగా ఉండాలని తెలిపారు, సెంటర్లో ప్యాడి క్లినర్  , అప్ డేటెడ్  వేయింగ్ మిషన్ , సరిపడ టార్పాలిన్స్, వడదెబ్బ తగలకుండా టెంటు సరిపడ తాగునీరు మరియు ఓఆర్ యస్ ఏర్పాటు చేయాలని తెలిపారు. తేమ శాతం 17%, తాలు 1%, మట్టి పెల్లలు రాళ్లు,1%,చెడిపోయిన మొలకెత్తిన  మరియు పురుగులు తిన్న ధాన్యం 5%, పూర్తిగా తయారు కాని ధాన్యం ముడుచుకుపోయిన మిశ్రమం 3% తక్కువ రకముల మిశ్రమం చెత్త తాలు పళ్ళు రాళ్లు పిల్లలు లేకుండా తీసుకురాగలరు.6%
ఈ కార్యక్రమంలో తసీల్దార్ రాజ్ కుమార్,ఎంపీడీఓ రవీందర్, ఎపియం కిషన్,కార్యదర్శి రాజ్ కుమార్ సిసి సురేశ్,శత్రజ్ఞడు కమీటీ సభ్యులు ,కవిత,రాధిక,మంజుల,లక్ష్మీ, ప్రవీణలత మరియు విజయ రైతులు ఇండ్ల రవి, పాపయ్య ,యాకయ్య హమాలి శ్రీను, భద్రయ్య గ్రామస్థులు  పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular