Wednesday, March 19, 2025

సంగెం: ప్రజల పక్షాన నిలబడి పోరాడాలి -మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

సంగెం మండల తేజ న్యూస్ టివి ప్రతినిధి

రానున్న పార్లమెంట్ మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. సత్తా ఏంటో  చాటాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  అన్నారు.శుక్రవారం హనుమకొండలోని వారి నివాసంలో నియోజకవర్గంలోని పరకాల,నడికూడా,ఆత్మకూర్,దామెర,గీసుగొండ,సంగేమ్ మండలాల ఎంపిపి,జెడ్పిటిసి,మండల అధ్యక్షులు,ఎంపిటిసిలు,మాజీ సర్పంచులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  మాట్లాడుతూ..గడిచిన పది సంవత్సరాలలో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు సక్రమంగా వినియోగిస్తూ, పంచాయతీలను అభివృద్ధి పర్చుకోవడంలో సర్పంచుల కృషి మరవలేనిదని అన్నారు.బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన గడువు ముగిసిన సర్పంచులను చల్లా ధర్మారెడ్డి  ఈ సందర్భంగా అభినందించారు.అదేవిధంగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అధైర్య పడకుండా ముందుకు సాగాలని,వారికి తనతో పాటు పార్టీ అండగా ఉంటుందని అన్నారు.రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, తాను ప్రజల మధ్యే ఉంటానని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతానని స్పష్టం చేశారు. రాబోయే పార్లమెంట్‌ మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా ఏంటో చూపాలని అన్నారు.బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ప్రజా క్షేత్రంలో ఉంటూ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని పిలుపునిచ్చారు.మీ అందరి సహకారంతో పరకాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని గుర్తు చేశారు.అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కాంగ్రెస్‌ నాయకులు అహంకారంతో మాట్లాడుతున్నారని, చిన్నా, పెద్ద, వయస్సు అనుభవంతో తేడాలేకుండా స్థాయిని మరిచి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.కేసీఆర్‌ సర్కారు మొదలు పెట్టిన పనులే ఇప్పుడు ప్రారంభిస్తున్నారు అని అన్నారు.
ఈ సమావేశంలో పరకాల,నడికూడా,ఆత్మకూర్,దామెర,గీసుగొండ,సంగేమ్ మండలాల ఎంపిపిలు,జెడ్పిటిసిలు,మాజీ సర్పంచులు,ఎంపిటిసిలు,మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular