Thursday, January 23, 2025

వరంగల్: పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి – నియోజకవర్గ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం

తేజ న్యూస్ టివి ప్రతినిధి

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి నివాసంలో ఆదివారం రోజు సమావేశమయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు,కార్యాచరణ, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు,నాయకులకు బాధ్యతల కేటాయింపు తదితర అంశాల పై ఈ  సందర్భంగా చర్చించారు.
అటవీ,పర్యావరణ,దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ,ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి,స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి,వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి రెడ్డి,పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి,భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు,వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు,వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ,కూడ చైర్మన్ &పరకాల నియోజకవర్గం ఇంచార్జి ఇనగాల వెంకట్రామ్ రెడ్డి,టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ ఆనంద్ కుమార్ -బొడ్డు సునీత,వర్ధన్నపేట నియోజకవర్గం ఇన్చార్జి నమ్మిండ్ల శ్రీనివాస్,డా.రియాస్,వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular