బీబీపేట మండలం తుజాల్ పూర్ గ్రామంలో వడ్లు కొనుగోలు చేయాలని రైతులు ధర్నా నిర్వహించారు గత పది రోజుల నుండి ఈదురు గాలులతో వడ్లు తడి ఆరబెట్టుకోవడం కోసం ఇబ్బందులు పడి ఇప్పుడు తడి ఆరిన వడ్లను కొనుగోలు చేయమంటే రైస్ మిల్ చైర్మన్ పప్పుల రాజు కొనుగోలు పై ఆంక్షలు విధిస్తూ లారీలను రానివ్వకుండా ఏ ఏ రైస్ మిల్లులకు వడ్లు లారీలను కేటాయించారు వివరాలు ఇవ్వకుండా ఆశల పేరుతో తరుగు సాకు చెబుతూ సొసైటీ ద్వారా కొనుగోలు చేస్తున్న వడ్లను సక్రమంగా రవాణా చేయక ఇబ్బందులకు గురి చేస్తుందని రైతులు ఆవేదన చెంది రైస్ మిల్ చైర్మన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా రాస్తారోకో చేశారు. పోలీసులు వచ్చి సముదాయించి సుమారు మూడు గంటలకు పైగా రైతులు ధర్నాలో కూర్చొని ఆవేదన వ్యక్తం చెందారు గత పది రోజుల క్రితం వడ్ల కల్లాల వద్ద ఐదుగురు పై పిడుగు పడి గాయ లైన రైతులపై దయ లేకుండా సొంత ఊరిలో రైతులకు న్యాయం చేయలేని రైస్ మిల్ అసోసియేషన్ చైర్మన్ జిల్లా రైతాంగానికి ఏం న్యాయం చేస్తాడని రైతులు తప్పుపట్టారు. ఇతని నిర్లక్ష్యం వల్లనే వడ్ల కొనుగోలు గత మాదిరిగా రవాణా కాకుండా ఈ సంవత్సరం ఆంక్షలు పేరుతో ఇబ్బందులు చేస్తున్నాడని అతని తీరును ఎండగడుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు మానేయ రాములు, శ్రీనివాస్ రెడ్డి , మల్లేశం ,హనుమ గౌడ్ , యాదయ్య ,ఆంజనేయులు, రాజు ,పెంటయ్య ,గుట్టయ్యా., రమేష్. , కిరణ్ కుమార్ , శ్రీధర్ , బాలమల్లు ,వెంకట్ పాల్గొన్నారూ.
వడ్లు కొనుగోలు చెయ్యాలని రైతుల ధర్నా..
RELATED ARTICLES