Thursday, May 22, 2025

బుచ్చినాయుడు కండ్రిగఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన వెంకటరత్నమ్మ.



తేజ న్యూస్ టీవీ

బుచ్చినాయుడు కండ్రిగ.
మండలంలోని మండల ప్రజా పరిషత్ అధికారినిగా శుక్రవారం సాయంకాలం వెంకటరత్నమ్మ ఎంపీడీవో ఆఫీసులో పదవీ బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గతంలో నాగలాపురం మండలంలో ఈవోపీఆర్డిగా పనిచేస్తూ ప్రమోషన్ మీద బుచ్చినాయుడు కండ్రిగ ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించడమైనదని ఆమె తెలియజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ 28 పంచాయతీలలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అప్పటికప్పుడు పంచాయతీ అధికారులు పంచాయతీ కార్యదర్శులు పంచాయితీ సర్పంచ్ ద్వారా సమస్యను పరిష్కరించగలతానని ఈ వేసవి కాలం నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారంలో మూడు నాలుగు రోజులు ప్రతి పంచాయతీ సందర్శించి అక్కడ పరిస్థితులను బట్టి చర్యలు తీసుకుంటానని ఆమె తెలియజేశారు అంతేకాకుండా ఈవోపీఆర్డి నుండి ఎంపీడీవో గా ప్రమోషన్ మీద రావడం నాకు చాలా సంతోషంగా ఉందని బుచ్చినాయుడును అభివృద్ధి మండలముగా తీర్చిదిద్దడానికి నా వంతు నేను కృషి చేస్తానని నేను నా తోటి సిబ్బంది అందరం కలిసి అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular