TEJA NEWS TV TELANGANA
ఈరోజు వాసవి క్లబ్ బీబీపేట మరియు కామారెడ్డి బ్లడ్ ఓనర్స్ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కొరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినాము, ఇట్టి రక్తదాన శిబిరంలో 105 మంది రక్తదానం చేసినారు, రక్తదానం చేసిన వారికి ఒక లీటర్ స్టీల్ వాటర్ బాటిల్ బహుమతిగా అందజేసినారు, అలాగే LV ప్రసాద్ కంటి ఆసుపత్రి వారు నిర్వహించిన ఉచిత కంటి చికిత్స శిబిరంలో 103 మందికి పరీక్షలు జరిపితే 15 మందికి ఆపరేషన్లు అవసరమని చెప్పినారు, ఇట్టి కార్యక్రమానికి అతిధులుగా టూరిజం శాఖ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గారు మరియు జైల శాఖ DIG దుద్దెల శ్రీనివాస్ గారు వాసవి క్లబ్ అధ్యక్షులు తొడుపునూరి నాగభూషణం కార్యదర్శి ఉప్పల సాయినాథ్, మాజీ డిప్యూటీ గవర్నర్ విశ్వప్రసాద్, తాటిపల్లి రమేష్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పబ్బా యాదగిరి వాసవి క్లబ్ అంతర్జాతీయ కోఆర్డినేటర్ బాసెట్టి నాగేశ్వర్ తదితర వాసవి క్లబ్ మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారుఅలాగే కామారెడ్డి రక్త దాతల సమూహ అధ్యక్షుడు జమీల్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సేవాదళ్ చైర్మన్ డాక్టర్ నీల బాలు మరియు కామారెడ్డి బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు