Thursday, May 22, 2025

ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి చే రెయిన్బో విద్యార్థులకు ఘనసత్కారం

ఇటీవలే విడుదలైన పదోవతరగతి ఫలితాల్లో రెయిన్బో విద్యార్థులు మండల స్థాయిలో విజయపతాకం ఎగురవేశారు. మండల స్థాయిలో మొదటి స్థానంలో నిల్చిన వేముల మనస్వినిని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సత్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే తన చేతుల మీదుగా మొదటి బహుమతిగా ₹10000 మనస్విని కి అందించారు.రెండొవ స్థానం లో నిల్చిన సుహానా బాను, గ్రీష్మిత ను మూడోవా స్థానం లో నిల్చిన సుహానాలను కూడా ₹5000 అందించి విద్యార్థులను అభినందించారు.ఈ సందర్బంగా ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అహర్నిశలు కష్టపడి పై చదువులకు వెళ్లి తమ జీవితాల్లో పై స్థాయిలో ఉండాలని ఆశీర్వదించారు. పై స్థాయిలో ఉండాలని కోరుకునే విద్యార్థులకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఎంతో అవసరం. వారి కృషి లేనిదే ఇంతటి ఘన విజయాన్ని సాధించలేరని మరొక సారి ఉపాధ్యాయుల కృషిని కొనియాడారు. ఈ సందర్బంగా పాఠశాల కరెస్పాండెంట్ చిట్టి బాబు మాట్లాడుతూ రెయిన్బో పాఠశాల నందు ప్రతి విద్యార్థి మీద ప్రత్యేక శ్రద్ధ చూపి వారు వెనుకబడిన సబ్జెక్టులలో వారికి మరల పాఠాలు చెప్పించడం, బాగా చదివే విద్యార్థులను ప్రోత్సాహక విద్యను అందించడం వారిపై మరింత శ్రద్ధ చూపి వారిని చదివించడం ద్వారా ఇంతటి విజయాన్ని సాదించామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ చిట్టి బాబు, మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజ, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular