TEJA NEWS TV
దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు చేగుంట మండల కేంద్రం లో నిరసన కార్యక్రమం చేపట్టారు. అసెంబ్లీలో దళిత స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీ జగదీశ్ రెడ్డి టిఆర్ఎస్ ఎమ్మెల్యే పై అలాగే ఆయనకు మద్దతు తెలుపుతున్న టిఆర్ఎస్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కేటీఆర్ ల శాసనసభ్యత్వాన్ని రద్దుచేసి చట్ట పరంగా వారిపై చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేశారు. అనంతరం కేటీఆర్, జగదీష్ రెడ్డిల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, మెదక్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు జంగాల గోవర్ధన్, రాజేష్,ఉపాధ్యక్షుడు మసాయిపెట్ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ మొజామిల్, ఎస్టీ సెల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్, మోహన్ నాయక్, యూవ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, సాయికుమార్ గౌడ్, బాసరాజు, జిల్లా మహిళా నాయకురాలు కుర్మ లక్ష్మి, బద్య నాయక్,తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి చేగుంట నర్సింగ్ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ జగదీష్ రెడ్డి ల దిష్టిబొమ్మ దహనం
RELATED ARTICLES