భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
చండ్రుగొండ మండలం
8-08-2025
ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇంటికి చేరుకున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, చండ్రుగొండ నమస్తే తెలంగాణ రిపోర్టర్ రామిశెట్టి సైదయ్యను చండ్రుగొండ మండలం కలం ప్రెస్ క్లబ్ సభ్యులు ఆయన నివాసమైన తిప్పనపల్లిలో వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుగులోత్ బలరాం నాయక్, కార్యదర్శి షేక్ జాఫర్, సభ్యులు సయ్యద్ నూరే రబ్బాని, మహ్మద్ పాషా, తాళ్ళూరి రాందాస్, రాచకొండ నాగేశ్వరరావు, కొదుమూరి సత్యనారాయణ, బరగడి వీరభద్రమ్, డి. లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
TWJF – తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రామిశెట్టి సైదయ్యను పరామర్శించిన కలం ప్రెస్ క్లబ్ సభ్యులు
RELATED ARTICLES



