

TEJANEWSTV :ఆలూరు టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు ఈరోజు 1/12/2025 హోలగుంద మండల కేంద్రంలోని స్థానిక ఇంద్రనగర్ కాలనీ లో బూత్ నెంబర్ 45 లో డిసెంబర్ 1వ తారీఖున సచివాలయం సిబ్బందితొ కలిసి పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హోళగుంద టీడీపీ యువ నాయకులు.టీడీపీ నేతలు మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన ప్రకారంగా చేసి చూపించారని *ప్రతి నెల తూచ తప్పకుండా సరిగ్గా 1వ తారీఖున సచివాలయం సిబ్బందితో పింఛన్లు దారులకు వృద్ధులకు & ఒంటరి మహిళలకు 4000 /-రూపాయిలు మరియు వికలాంగులకు 6000 /- రూపాయిలు పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది* అని అందుకుగాను టీడీపీ నేతలు మన కూటమి ప్రభుత్వంనికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బూత్ ఇంచార్జ్ మరియు ఐటీడీపీ హనుమంతు సిద్ధార్థ సినిమా మంగన మూర్తి మళ్లీ సచివాలయ సిబ్బంది శివకృష్ణ నాయక్ మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు పించన్ దారులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.



