Thursday, October 30, 2025

గుడిబండ లో వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం పర్యటన

శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలంలోని మొంత తుఫాన్ లో భాగంగా రాళ్లపల్లి గ్రామ పంచాయతీలో సాగుచేసిన వరి, వేరుశెనగ, రాగి, మొక్కజొన్న, కంది మరియు ఉలవ పంటలను వ్యవసాయ పరిశోధన స్థానం అనంతపురం శాస్త్రవేత్తలు భాస్కర రావు మరియు  లక్ష్మణ్ లు పరిశీలించారు. వరిలో కాండం తలుచు పురుగు మరియు ఆకు మడత పురుగు ను గమనించడం జరిగింది. దీని నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందు ఒక లీటర్ నీటికి ఒక గ్రామ కలిపి పిచికారి చేసుకోవాలని సూచించారు.
అలాగే వాతావరణం మబ్బులు కమ్ముకొని ఉండటం వలన తెగుళ్లు వచ్చే అవకాశం ఉందని పొటాష్ ఎరువు ను ఒక ఎకరాకు 50 కేజీల చొప్పున వేయాలని సూచించారు.
కందిలో కాయ ఈగ శనగపచ్చ పురుగు మరియు మారుక  మచ్చల పురుగు ఆశించవచ్చని నివారణకు క్లోరిపైరిపాస్ 2.5 ml లేదా అసిపేట్ 1 gram లేదా క్వినాల్ ఫాస్ 2 ml లేదా కురాజన్ 0.3 gram ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలన్నారు.
మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు ఏమామెక్టిన్ బెంజోయేట్ 0.4 gram ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలని సూచించారు.
సేంద్రియ వ్యవసాయం మరియు ప్రకృతి వ్యవసాయం పాటించడం వలన నేల ఆరోగ్యము భూసారము పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చు అని రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వీర నరేష్, రైతు సేవా కేంద్రం సిబ్బంది, ప్రకృతి వ్యవసాయం సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular