Friday, September 12, 2025

హొళగుంద మండలంలో ఎస్సీ సమస్యలపై ఎమ్మార్పీఎస్ నాయకుల వినతి – సబ్ కలెక్టర్‌కు అర్జీలు సమర్పణ

హొళగుంద, సెప్టెంబర్ 12: ఈరోజు సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కెంచప్ప మాదిగ, ఎం ఎస్ పి మండల అధ్యక్షుడు దేవప్ప మాదిగ గారి నేతృత్వంలో అనేక సమస్యలపై అర్జీలు సమర్పించారు.

హొళగుంద మండలంలోని ఎస్సీ వర్గానికి సంబంధించి ప్రధానంగా నాలుగు కీలక అంశాలపై వినతులు అందించారు:

1️⃣ స్మశాన వాటికల కొరత: వన్నూర్ క్యాంప్, వందవాగిలి, గజ్జహళ్లి, సమ్మతగేరి వంటి గ్రామాల్లో ఎస్సీ వర్గానికి స్మశాన వాటికలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

2️⃣ SC హాస్టల్ మూసివేత: గత 8 సంవత్సరాలుగా మండలంలోని ఎస్సీ హాస్టల్ మూతపడిన కారణంగా విద్యార్థులు వసతి లేక చదువులకు దూరమవుతున్నారని పేర్కొన్నారు.

3️⃣ సివిల్ రైట్స్ డే నిర్వహణ: ప్రతి నెల 30న సివిల్ రైట్స్ డే నిర్వహించి, జాతీ మత లింగ భేదాల లేకుండా ప్రజలకు పౌర హక్కులపై అవగాహన కల్పించాలని డిమాండ్ చేశారు.

4️⃣ హొళగుంద రోడ్డు పరిస్థితి: ఆదోని నుండి హొళగుందకు వచ్చే ప్రధాన రహదారి గుంతలతో అధ్వానంగా మారిందని, గత 2 సంవత్సరాలుగా బస్సులు నడపలేక నిలిపివేయడం జరిగిందని తెలిపారు. ఈ రోడ్డు మరమ్మతులు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు దుర్గప్రసాద్, నాగరకన్వి వెంకటేష్, పల్లి ఈరన్న, కల్లప్ప, గోవిందు, శేషగిరి, వెంకటేష్, యువ నాయకులు హనుమంతు, వీరేష్, మల్లి, రాజు, నగేష్, పరశురాం, మృత్యుంజయ, సాయిబేస్ తదితరులు పాల్గొన్నారు.

మండల ప్రజల సమస్యలపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular