
చేగుంట జులై 3
మెదక్ జిల్లా, చేగుంట మండలంలోని వివిధ పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడి ని నియమించాలని, నగదు రహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని, జీవో 317 బాధితులందరికీ న్యాయం చేయాలని, పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పి ఆర్ సి ని ప్రకటించి వెంటనే అమలు చేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి ఓపిఎస్ విధానాన్ని అమలు చేయాలని, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు సమ్మె కాలపు వేతనాన్ని వెంటనే చెల్లించాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 కింద వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ చేగుంట మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రావుల వెంకటేష్, తంగెళ్లపల్లి కృష్ణమూర్తి,జిల్లా ఉపాధ్యక్షురాలు రేఖ,మండల ఉపాధ్యక్షులు మధునాల శ్రీనివాస్,సంగీత, అమరేశ్వరి, మండల కమిటీ సభ్యులు,రాధా, సరస్వతి, సునీత, మంజులత, సంధ్యారాణి, వీణ, సలీం, బంగారయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.