Wednesday, February 5, 2025

ఎన్టీఆర్ జిల్లా : ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన తంబళ్లపల్లి రమాదేవి

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం,
చందర్లపాడు మండల అధ్యక్షుడు అయిన వడ్డేలి సుధాకర్ గారి ఆహ్వానం మేరకు కాసరబాద గ్రామంలో జరుగుతున్న ముగ్గుల పోటీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి ,
ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు బహుకరించారు.అలాగే రమాదేవి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ ఎంతో ముఖ్యమైన పండుగగా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఈ పండుగని జరుపుకుంటారు.ఇదే ఉత్సహంతో వచ్చే సంవత్సరం జనసేన టిడిపి ప్రభుత్వంతో ఈ పండుగను మరింత ఘనంగా జరుపుకుందాము. అలాగే జనసేన,టిడిపి అధికారంలోకి రాగానే శ్రీ వేణుగోపాల లిఫ్ట్ ఇరిగేషన్ బాగు చేసి ఈ ప్రాజెక్టు కింద ఉన్న కాసార బాధ, చందర్లపాడు, కొడవటికల్లు,ఉస్తేపల్లి, పొక్కునూరు గ్రామాల రైతులకు ఉపయోగపడేలా కృషిచేసి తీరుతాను అని మాటిచ్చారు. జనసేన పార్టీ నందిగామ నియోజకవర్గం సమన్వయకర్త శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular