Wednesday, February 5, 2025

హొళగుంద మండల కేంద్రంలో ప్రజలకు అందని రేషన్ బియ్యం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పౌరసరఫరాల శాఖ నేడు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రతిష్టాత్మక మార్పులు మెరుగు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులకు, గురికాకుండా ఇంటి వద్దకే బియ్యం సరఫరాను చేయబడింది. అయితే రేషన్ బియ్యం సరఫరా అని తూట్లు పొడిచే విధంగా డీలర్లు అధికారులు వ్యవహరిస్తున్నారు అని ప్రజలు వాపోయారు .
సంబంధిత అధికారుల నిర్లక్ష్యం , పర్యవేక్షణా లోపం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురి కావాల్సి వస్తుంది. ఇంతకుముందు కూడా ఇలాంటి సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువచ్చిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అధికారుల ఉదాసీనత డీలర్ల నిరీక్షణ వల్ల ,నేడు కూడా ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. మండల కేంద్రమైన హొళగుందలో డీలర్ షాప్ నంబర్ 31 నందు ఈ సమస్య తలెత్తడంతో ప్రజలు తీవ్ర ఆవేదనతో వ్యక్తం చేసి ధర్నా నిర్వహించడం జరిగింది. అధికారుల నిర్లక్ష్యం వీడాలి, డీలర్లను వెంటనే సస్పెండ్ చేయాలి, బియ్యం వెంటనే పంపిణీ చేయాలి అంటూ ప్రజలు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. తాసిల్దార్ హుస్సేన్ సాహెబ్ మరియు ఆర్ఐ వినోద్ ధర్నా నిర్వహించిన ప్రజలకు 15 తేదీల్లో బియ్యం పంపిణీ చేసే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు . ఈ కార్యక్రమంలో 4,8,9, వార్డు మేంబర్లు ప్రజలు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular