TEJA NEWS TV : నిజం సార్ మండలంలోని మహమ్మద్ నగర్ నూతన మండలం గా ఏర్పాటు అయినందుకు మహమ్మద్ నగర్ గ్రామంలోని ప్రజలు సోమవారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ రాజుకు మిఠాయి తినిపించి, టపాకాయలు కాల్చారు. నూతన మండలం గా ఏర్పాటు అయినందుకు రాజుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుణుకుల్ సింగల్ విండో చైర్మన్ వాజిద్ అలీ, నాయకులు కాశయ్య, మహేందర్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.
