TEJA NEWS TV TELANGANA 75 యేండ్ల ముదిరాజుల కల నెరవేరిన వేల.. సుదీర్ఘ పోరాటంతో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు./- *డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ TMMS జిల్లా అధ్యక్షులు* .
****
75 యేండ్లుగా చట్ట బద్ధమైన హక్కు కోసం కోట్లాడుతూ, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బోనాల గ్రామ ముదిరాజుల కల నెరవేరిన వేల..
సుదీర్ఘ పోరాటంతో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటుకు స్కిల్ టెస్ట్ నిర్వహించి 58 మందిని సభ్యులుగా చేస్తూ సొసైటీని ఏర్పాటు చేయడంతో సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కిందని కామారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఇచ్చిన హామీలను అమలు చేసి ముదిరాజ్ జాతి అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు.అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంతోనే ఈ ఫలితం సాధ్యమని కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ అన్నారు.
లింగంపేట మండలంలోని బోనాల గ్రామంలో ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులతో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ మాట్లాడారు.
గ్రామ గ్రామాన ముదిరాజ్ జండాలను ఆవిష్కరణ తో చైతన్యం ఏర్పడిందన్నారు. యువత మహిళలు సామాజిక మాధ్యమాల్లో (గ్రూప్) చేరి తమ లక్ష్యాలను సాధించే దిశగా ఉద్యమించడంతో ఫలితాలు,పొందుతున్నట్లు తెలిపారంతెలిపారు. దీంతో పాటే ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల, ఏర్పాటుకు నిరంతర పోరాటం చేయడంతో నేడు ఫలితాలను ఇస్తుంది. పెద్దమ్మ తల్లి ఆలయాల నిర్మాణం, ఉమ్మడి జిల్లాలో (కామారెడ్డి-నిజామాబాద్)చురుకుగా,సాగుతున్నాయన్నారు.
పట్టుదలకు నిదర్శనం.
ముదిరాజ్ ల సాంప్రదాయం, సంస్కృతి నిర్మాణం ఒక్కవైపు వృద్ధి సాధిస్తూనే… ” *మేమెంతో- మాకంత* అనే వాట కోసం రాజ్యాంగ స్ఫూర్తితో..
ధర్మ యుద్ధ పోరాటం చేస్తూనట్లు డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్ తెలిపారు.
న్యాయస్థానాల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ,తిరుగుతూ చట్టపరమైన ఆర్థిక ప్రగతిని,రాజకీయపరమైన పదవులను, విద్యా ఉద్యోగ, ఉపాధి వాటకోసం..కోట్లాడడం లో, ప్రభుత్వం పై ఒత్తిడి పెంచడంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ క్రియాశీలకంగా వ్యవహరిస్తోందన్నారు .
మరోవైపు వ్యూహాత్మక విధానంతో. విద్యా ఉపాధి అవకాశాల కోసం BC”A” (Go.no.15) అమలుతో విద్య, ఉద్యోగాలలో సరైన వాట కై – నా ఘర్షణ..మా సంఘర్షణ.(ఐక్యంగా)అని చాలా సార్లు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ వివరించారు.
తరం..తరం..నిరంతరం..తరతరాల అణిచివేత పై అలుపెరగని ఉద్యమ బావుటను ఎగురవేస్తూ.. ముదిరాజ్ జాతి చైతన్యానికి డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్ నిదర్శనంగా నిలిచారని జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు గాదం సత్యనారాయణ కొనియాడారు.
మత్స్య శాఖలో సభ్యత్వాలు సాధనే లక్ష్యంగా – – ప్రభుత్వం పై ఒత్తిడి తేవడం… నా పంతం’అని ధర్నాలతో, పెద్దఎత్తున నిరసన ర్యాలీలతో,ఊరేగింపులతో,రాస్తారోకోలతో,బహిరంగ సభలతో, కలెక్టర్, రెవెన్యూ కార్యాలయాల ముట్టడితో ,సెమినార్ లతో,గ్రూప్ చర్చలతో, ముదిరాజ్ ల పక్షాన నిలబడి పోరాడుతున్న విషయం,అందరికీ తెలిసిందేనాని సత్యనారాయణ తెలిపారు. చరిత్రను..తిరగేస్తూ
డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్,చేస్తున్న ఉద్యమం అందరికీ స్ఫూర్తి దాయకం. నిస్వార్ధంగా మొదటి నుండి నేటి వరకు”జాతి కోసం “కాలుకు గజ్జ కట్టుకునీ తిరిగుర్తుతున్న విజేత… విట్టలన్న” అని జిల్లా కామారెడ్డి జిల్లా ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మండల్ బిబిపేట మండల్ లో కొరివి నర్సింహులుమత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు సత్యనారాణ బెస్త కొనియాడారు.
ఈ కార్యక్రమంలోమత్స్య శాఖ AD శ్రీహరి,మండల అధ్యక్షులు సాయికుమార్ పోతాయిపల్లీ నాయకులు బాలయ్య ముదిరాజ్ శెట్పల్లి నాయకులు పాల్గొన్నారు
