Thursday, January 16, 2025

నర్సంపేట: కార్యకర్త “కొమ్ము రంజిత్” కుటుంబానికి “రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును అందించిన కొణిదెల నాగబాబు

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం” కొమ్ము రంజిత్ కుటుంబ సభ్యులకు ఆర్థికంగా ఆసరాగా నిలవడం సంతోషనియం
నియోజకవర్గ ఇన్చార్జ్ మేరుగు. శివకోటి యాదవ్

TEJA NEWS TV

నర్సంపేట

రోడ్డు ప్రమాదంలో మరణించిన నెక్కొండ మండల అలంకానిపేట గ్రామ జనసేన కార్యకర్త “కొమ్ము రంజిత్” కుటుంబానికి “రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును అందించిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ “కొణిదెల నాగబాబు
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం” ఈరోజు కొమ్ము రంజిత్ కుటుంబ సభ్యులకు ఆర్థికంగా ఆసరాగా నిలవడం సంతోషనియం
నియోజకవర్గ ఇన్చార్జ్ మేరుగు. శివకోటి యాదవ్

హైదరాబాదులోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండలం

అలంకానిపేట గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త కొమ్ము రంజిత్ కుటుంబ సభ్యులు *తండ్రి యాకయ్యకు రూ.5లక్షల(500,000/-) ప్రమాద బీమా చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి జనసేన కార్యకర్త భద్రత భరోసా కోసం గొప్ప ఆలోచనతో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉన్న ప్రతి జనసైనికుడికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.అలాగే జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు ములుకుంట్ల.సాగర్ నియోజకవర్గ నాయకులు మేరుగు శివకోటి యాదవ్ ఆధ్వర్యంలో కొమ్ము రంజిత్ తండ్రి యాకయ్య,సోదరుడు కర్ణాకర్ లను పరామర్శించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుని రంజిత్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.అలాగే తమ కుటుంబానికి . జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ 5 లక్షల ప్రమాద బీమా రావడానికి ఈ ప్రక్రియకు సహకరించిన నియోజకవర్గ ఇన్చార్జ్ “మేరుగు శివకోటి యాదవ్ సభ్యత్వం చేయించిన “వంగ.మధు”,ఓర్సు.రాజేందర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి శ్రీ నేమూరి శంకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు రాధారపు రాజలింగం,ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular