TEJA NEWS TV
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని కేజిబీవి పాఠశాల అలాగే కొత్తపల్లి మండల కేంద్రంలోని స్థానిక కేజీబీవీ బాలికల పాఠశాలల్లో “10 వ తరగతి పరీక్షల మార్కులే జీవితమా?” అనే అంశంపై విద్యార్థులకు గురువారం నాడు నంద్యాల జిల్లా కెరీర్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల జి.సి.డి.ఓ నాగ సువర్చాలా హాజరయ్యారు. 10వ తరగతి విద్యార్థులకు రాబోయే పరీక్షల, ఫలితాల పట్ల మానసికంగా, దృఢంగా ఉండేలా ప్రోత్సహించడంతో పాటు, కేవలం పరీక్షలు మరియు మార్కులకే ప్రాధాన్యత ఇవ్వకుండా జ్ఞానసంపాదన, క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల వంటి లక్షణాలు జీవిత విజయానికి కీలకమని తెలియజేశారు. అలాగే అభిరుచులు, సామర్థ్యాలను అంచనా వేసుకుని విద్యార్థులు కోర్సులను ఎంపిక చేసుకోవాలని అన్నారు. ఆశించిన స్థాయిలో మార్కులు రాకపోయినా ఒత్తిడికి గురికాకుండా మరింత కృషిచేసి విజయం సాధించవచ్చని , విద్యార్థులు జీవిత లక్ష్యాలను సాధించేందుకు మార్గదర్శనం అవ్వాలని.. మెంటల్ హెల్త్ కౌన్సిలర్లు శ్రీరామ్, నాగన్న, సునీత వివరించారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ శ్యామల , కొత్తపల్లి కేజీబీవీ ప్రిన్సిపల్ కృష్ణబాయి తదితరులు పాల్గొన్నారు.
