హొళగుంద మండల కేంద్రంలో ఈరోజు
సావిత్రిబాయి పూలే మహిళల స్వేచ్ఛ సమానత్వం కోసం ఎనలేని కృషి చేశారని ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ వ్యవస్థాపకులు సిహెచ్ నాగరాజు కొనియాడారు మండల కేంద్రమైన హోళగుందలో సీజనల్ హాస్టల్ నందు ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం సావిత్రిబాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళల హక్కులు విద్యను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. మహిళా ఉపాధ్యాయురాలిగా బాలికలకు అనగారిన వర్గాల వారికి విద్య అవకాశాలు కల్పించేందుకు ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా మహిళల స్వేచ్ఛ సమానత్వం కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. జనవరి, 3 ,1831న సావిత్రిబాయి పూలే జన్మించారన్నారు. అంతకుముందు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఉపాధ్యాయులు సోహెబ్,దుర్గయ్య , సీజనల్ హాస్టల్ సిబ్బంది సుజాత, ఈరమ్మ,మహిళల,విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
RELATED ARTICLES



