సంగెం మండల తేజ న్యూస్ ప్రతినిధి
రెడ్ క్రాస్ హనుమకొండ వారి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హనుమకొండ మొబైల్ మెడికేర్ యూనిట్ ఆధ్వర్యంలో శుక్రవారం భిక్కోజీ నాయక్ తండా గ్రామంలోని గ్రామ పంచాయతీ లో వృద్దులకు ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆరోగ్య శిబిరమును హనుమకొండ రెడ్ క్రాస్ చైర్మన్ : డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి కోశాధికారి, బొమ్మినేని పాపిరెడ్డి , ప్రారంభించారు.
ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటిస్, సీనియర్ సిటిజన్స్, భారత ప్రభుత్వ సహాకారంతో 60 సంవత్సరాలు పైబడిన వయో వృద్ధులకు ఇంటి వద్దనే రక్త పరీక్ష సేవలనందించేందుకు హనుమకొండ రెడ్ క్రాస్ సంచార వైద్యశాల సేవలు అందిచడం జరుగుతుందని, ప్రతి నెల మీ గ్రామానికి వచ్చి క్యాంపు నిర్వహించి వృద్ధులకు బిపి. షుగర్ రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించటం జరుగుతుందని, ఇలాంటి వైద్య శిబిరాలను గ్రామాలలోని వృద్ధులంతా సద్వినియోగం చేసుకోవాలని పాలకవర్గం తెలిపారు. ఈ సందర్భంగా సంగెం మండల బీజేపీ ఎస్ టి, మోర్చ అద్యక్షులు: సపవత్ మహేందర్ నాయక్ చైర్మన్, కోశాధికారి ని శాలువాతో సన్మానించారు.
ఈ ఆరోగ్య శిబిరంలో రెడ్ క్రాస్ డాక్టర్లు : జి. డా. జి. కిషన్ రావు, డా. మొహమ్మద్ తహర్ మసూద్, రెడ్ క్రాస్ సంస్థ వైస్ చైర్మన్ వెంకట నారాయణ గౌడ్, సిబ్బంది : గుల్లెపెల్లి శివకుమార్, అరువ గంగాధర్, పవన్, కేశోజు రమేష్, సుమంత్, ఈ ఆరోగ్య శిబిరానికి సంగెం మండల బీజేపీ ఎస్ టి మోర్చ అద్యక్షులు: సపవత్ మహేందర్ నాయక్ సహకారం అందచేశారు. గ్రామ సర్పంచ్: బానోత్ సంధ్యారాణి, ఎంపీటీసీ: బానోత్ పద్మ, గ్రామ ప్రజలు, వంశీ కృష్ణ, బాలు, మరియు వృద్దులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రెడ్ క్రాస్ సొసైటీ, మొబైల్ మెడికేర్ యూనిట్ అధ్వర్యంలో మెగా వైద్య శిబిరం
RELATED ARTICLES