నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన రైతు కోటేశ్వరరావు వేధింపుల కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధిత రైతు కోటేశ్వరరావు ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బాబు అను వ్యక్తికి మూడు సంవత్సరాల క్రితం తనకున్న ఎకరా పొలం విక్రయించడం జరిగిందని, ఆ సమయంలో పూర్తి డబ్బులు చెల్లించకుండా సుమారు పది లక్షల రూపాయలు తర్వాత చెల్లిస్తాను అని చెప్పి నేటి వరకు చెల్లించక పలుమార్లు మానసిక మరియు శారీరక వేదనకు గురి చేయడం జరిగిందని, చివరి ప్రయత్నం గా శుక్రవారం రోజు బాబు ఇంటి వద్దకు వెళ్లి తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలనీ కోరగా డబ్బులు ఇచ్చేది లేదు అంటూ మానసిక వేదనకు గురి చేశారని ఆవేదనతో వెంట తెచ్చుకున్న పురుగుల మందు బాబు ఇంటి ముందర సేవించినట్లు బాధితుడు తెలిపారు. వెంటనే స్థానికులు 108 ఫోన్ చేసి ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు స్థానికులు తెలిపారు.
మోసం చేశారని వారి ఇంటివద్ద రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
RELATED ARTICLES