Monday, January 12, 2026

మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన చేగుంట గ్రామపంచాయతీ ఈవో వెంకటేశం

TEJA NEWS TV TELANGANA :

మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన చేగుంట గ్రామపంచాయతీ ఈవో వెంకటేశం
ఆయన మాట్లాడుతూ  మహనీయుడు బాపూజీ అహింస సిద్ధాంతమే ఆయుధంగా ఆంగ్లేయుల  నుంచి భారత దేశ ప్రజలకు స్వేచ్ఛను సమస్త విశ్వానికి శాంతిని ప్రసాదించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని గురువారం మహాత్మ గాంధీ 156వ జయంతిని పురస్కరించుకొని  గాంధీ విగ్రహానికి పూలమాల వేసి  నివాళులర్పించారు.భారతావనికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం అందించడం కోసం అహింసా పద్ధతిలో శాంతియుతంగా పోరాటం చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని  ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అన్నారు. గాంధీజీ ఎంచుకున్న శాంతి అహింస మార్గం భారతీయులకే కాదు ప్రపంచానికే స్ఫూర్తినిచ్చిందని కొనియాడారు. అలాంటి మహోన్నత బాపూజీ మార్గం నుంచి నేటి యువత స్ఫూర్తి పొంది ఆయన బాటలో నడవాలని కోరారు ఈ కార్యక్రమంలో,   వివో వెంకటేశం, గ్రామ పంచాయతీ సిబ్బంది తలారి లింగం, దాదే  రాములు, పాల్గొన్నారు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular