Saturday, November 8, 2025

బాచేపల్లె–అహోబిలం రోడ్డుకు భూమి పూజ: 2.85 కోట్లతో నిర్మాణం ప్రారంభం!

TEJA NEWS TV :నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ…

ఆళ్లగడ్డ మండలం బాచేపల్లె నుండి అహోబిలం కు 8 మీది కిలోమీటర్ల రోడ్డును 2 కోట్ల 85 లక్షల రూపాయల  తో నిర్మాణ   భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు…

ఎంతోకాలంగా అహోబిలం వెళ్లభక్తులకు బాచేపల్లె నుంచి రోడ్డు సరిగాలేదని నా దృష్టికి తీసుకురావడం జరిగిందని, నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి సంబంధాలతో మాట్లాడి రోడ్డు కు అవసరమైన తీసుకొని వచ్చి రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తున్నామని, అహోబిల లక్ష్మీనరసింహస్వామి తిరుణాల స్టార్ట్ అయ్యేలోపు రోడ్డు పూర్తవుతుందని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు…

వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సర్పంచులకు ఎటువంటి నిధులు ఇవ్వకుండా ఎంతో ఇబ్బంది పెట్టింది, మన ప్రభుత్వం వచ్చాక సర్పంచులు యదేచ్చగా ప్రతి ఒక పనులు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారని, పార్టీలకు అతీతంగా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం పనులు చేస్తుందని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు…

బాచేపల్లె కు మొదటి విడత NREGS 40 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని  మళ్ళీ రెండో విడత 20 లక్షల రూపాయలు ఇచ్చామని, అలాగే ముస్లిం సోదరుల కోరిక మేరకు షాది ఖానా మసీద్ త్వరలోనే తీసుకొని వస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు…

ఆళ్లగడ్డ మండలం అంతట ప్రతి ఒక్క చోట అభివృద్ధి పనులు పూర్తవుతున్నాయని మొదటి విడత తర్వాత మళ్లీ ఆళ్లగడ్డ మండలానికి రెండో విడతలో రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అహోబిలంలో మొదటి విడత 40 లక్షలు రెండో విడత 15 లక్షలు అహోబిలం కు దొరకోట్టలకు ఇవ్వడం జరిగిందని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు…

గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు బాచేపల్లె గ్రామంలో ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగిందని వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని మళ్లీ తీసుకున్నారని, ఇప్పుడు మళ్లీ మన ప్రభుత్వం వచ్చింది కచ్చితంగా  ఇంటి స్థలాలు ఇప్పించి ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చిన  ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular