Wednesday, February 5, 2025

నంద్యాల: నిరాశ్రయులైన,నిరుపేదలకు బెషీట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించిన వ్యాపారవేత్త గోళ్ల రాజేష్

TEJA NEWS TV
నంద్యాల పట్టణంలోని నిరాశ్రయులైన,నిరుపేదలకు నంద్యాల పట్టణ వాసులు వ్యాపారవేత్త గోళ్ల రాజేష్ ఆధ్వర్యంలో బెషీట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు

2024 నుండి 2025 నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 2024,31తేదిన రాత్రి నంద్యాల పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని నంద్యాల పట్టణ వాసులు వ్యాపారవేత్త గోళ్ల రాజేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం వారు నంద్యాలలో లేని కారణంగా అయన ఆధ్వర్యంలో నిరాశ్రయులకు నిరుపేదలకు ఈ చలికాలంలో చలి తీవ్రత ఎక్కువ ఉన్నందువల్ల వారికి తనవంతు సహాయంగా బెడ్షీట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

గోళ్ల రాజేష్ వారు అనుసరించే విధానంతో ప్రార్థించే పెదవుల కన్నా.. సహాయం చేతులు మిన్నా.. అనే తాను నమ్మి అనుసరించే సిద్ధాంతంలో భాగంగా తను నంద్యాల పట్టణ ప్రజలకు తన వంతు సహాయంగా ఎల్లప్పుడూ ఏ సేవా కార్యక్రమాలకు చేయడానికి తాను ఎల్లప్పుడు ముందు ఉంటానని అదే విధంగా ఎలాంటి సాయం కావాలన్నా తనను సంప్రదిస్తే అందుకు ఆయన ముందుకు వస్తానని తాను వంతు సహాయం చేసేందుకు ఎల్లప్పుడు సిద్దంగా ఉంటానని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు నంద్యాల వాసులు గొల్ల రాజ్య ఆధ్వర్యంలో నిర్వహించడం అందులో తమను భాగస్వామ్యం చేయడం చాలా సంతోషకరమని గొల్ల రాజేష్ అభినందిస్తూ అదే విధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో గొల్ల రాజేష్ ఇంకా ఇలా‌ ఎన్నో నిర్వహించాలని అందులో తమ వంతు సహాయంగా వారికి ఎల్లప్పుడూ తమ వంతు సహకారం ఉంటుందని కూడా వారు తెలిపారు

ఈ కార్యక్రమంలో ఖాజా హుస్సేన్, ఇంటర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ రాయలసీమ జోనల్ ఇంచార్జ్ ఎన్.ఎం.డి ఫయాజ్,టాప్ న్యూస్ రిపోర్టర్ షరీఫ్ మరియు మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular