Monday, June 2, 2025

నంద్యాలలో హై టెన్షన్ టెన్షన్

*నంద్యాలలో హై టెన్షన్ టెన్షన్*
*-నడిగడ్డలో క్షణం క్షణం భయం భయం*
*-ఒక వెంచర్ నుంచి వెళ్లే రహదారి మూసివేత*
*-రాకపోకలు నిషేధిస్తూ నిర్మాణాలు*
*-ఇప్పటికే ఒక వర్గంపై మరో వర్గం దాడి*
*-పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న ఇరు వర్గాలు*
*-తాజాగా ఒక వర్గానికి తీవ్ర బెదిరింపులు… పోలీసులకు మరో ఫిర్యాదు..!*

నంద్యాల: నంద్యాల పాత పట్టణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పాత పట్టణంలో అభివృద్ధి చెందుతున్న నడిగడ్డలో క్షణం క్షణం భయం భయంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఒక వెంచర్ నుంచి వెళ్లే ఒక రహదారిని మూసివేశారు. మరో రహదారిలో రాకపోకలు నిషేధిస్తూ శరవేగంగా నిర్మాణాలు జరిగిపోతున్నాయి. ఇప్పటికే ఒక రహదారి విషయంలో ఒక వర్గంపై మరో వర్గం దాడికి తెగబడింది. మరో వర్గం తమపై దాడి జరిగిందని ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. తాజా ఒక వర్గానికి మరో వర్గం నుంచి బెదింపులు తీవ్రతరం కావడంతో పోలీసులకు మరో ఫిర్యాదు అందచేసే ఆలోచనలో ఉన్నారు. ఒకవైపు రహదారి మూసివేతతో అవతలి వైపు ఉన్న ఇళ్లకు రాకపోకలు మరో వైపు ఆ ప్రాంతంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను నిలిచిపోయాయి.
రహదారి కోసం ఇళ్ల యజమానులు… ఇంటి నిర్మాణాల యజమానులు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం రహదారి మూసి వేసిన వెంచర్కు వెళ్లేందుకు ప్రధాన రహదారి హక్కులు లేకపోయిన పది ఏకరాలకు పైగా ప్లాట్లు వేసి అమ్మకాలు జరిపినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. వెంచర్కు వెళ్లేందుకు రహదారిగా చూపించినది ఒక స్థలంగా ఇద్దరి పేరుతో రిజిస్ట్రేషన్ ఉన్నట్లు తెలుస్తోంది. వెంచర్ నుంచి వెళ్లే రహదారి మూసివేత అంశం అధికార పార్టీ నేతల దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. ఆ వెంచర్కు అనుకొని ఉన్న 50 సెంట్ల స్థలం వ్యవహరం రహదారి మూసివేతకు కారణంగా చెబుతున్నారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే నడిగడ్డ ప్రాంతంలో రహదారుల వివాదం తీవ్ర ఉద్రిక్తతలను దారితీస్తున్న నేపథ్యంలో కథనం ఇది.
నంద్యాల పాత పట్టణంలోని ప్రధానమైన నడిగడ్డలో రహదారుల అంశంగా ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. ఒక వెంచర్కు వెళ్లే రహదారి ఒకటి అయితే ఆ వెంచర్ నుంచి వెళ్లే మరో రెండు రహదారులు ఇందుకు కారణం అయ్యాయి. స్ధిరాస్తుల వ్యాపారుల మధ్య రహదారులు వివాదస్పందగా మారాయి. వ్యాపారుల మధ్య తలెత్తిన రహదారుల వివాదం సమీపంలోని ఇళ్ల యజమానులు, ఇళ్ల నిర్మాణాల యజమానులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. గడిచిన ఐదు రోజులుగా ఆ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. మరో రహదారి నుంచి నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లకు రహదారి సమస్య తలెత్తే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. నడిగడ్డ ప్రాంతంలో కొందరు స్ధిరాస్తి వ్యాపారులు సుమారు పది ఏకరాల్లో వెంచరు ఏర్పాటు చేశారు. ఆ వెంచర్లోని ప్లాట్లకు వెళ్లేందుకు చూపించిన రహదారి ఇద్దరి పేరిట స్థలంగా రిజిస్ట్రేషన్ అయింది. వెంచర్కు ప్రధానంగా రహదారి లేకపోవడం ఒకటైతే ఆ వెంచర్లో ఏర్పాటైన ఒక రహదారుల్లో ఒక చోట పూర్తిగా రోడ్డుకు అడ్డంగా మట్టిని వదలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఆ వెంచర్లోని మరో రహదారిపై ఇతరులు ఎవరూ రాకపోకలు సాగించకుండా పిల్లర్లను నిర్మించారు. ఆ పిల్లర్లకు గేటును ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్ధమైంది. వెంచర్లోని రహదారిని అనుకొని ఉన్న 50 సెంట్ల స్థలాన్ని స్థిరాస్తి వ్యాపారులు కొందరు బృందంగా ఏర్పడి కొనుగోలు చేశారు. ఆ స్థలాన్ని మరో స్థిరాస్తి వ్యాపారుల బృందం దక్కించుకోవాలని చూసినట్లు తెలుస్తోంది. అప్పటికే మొదటి బృందం కొనుగోలు చేసి యజమానులకు కొంత నగదును చెల్లించినట్లు తెలుస్తోంది. ఆ స్థలానికి రహదారి లేకుండా చేయడంలో భాగంగానే రహదారిపై మట్టి కుప్పను వదిలినట్లు తెలుస్తోంది. ఐదు రోజుల క్రితం రహదారుల అంశాలపై మాట్లాడుకునేందుకు ఒక చోట ఇరువర్గాలు సమావేశం అయ్యాయి. ఆ సమయంలో ఒక వర్గంపై మరో వర్గం దాడి చేసినట్లు తెలుస్తోంది. బాధితుడు ఒకరు నంద్యాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదే రోజు మరో వర్గం తమపై దాడి జరిగినట్లు అదే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఇరువర్గాల ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అధికార టీడీపీ మహానాడు జరుగుతుండటంతో కొందరు పోలీసులు ఆ విధుల్లో ఉన్నారు. మహానాడు గురువారం ముగిసింది. ఇదే సమయంలో వెంచర్లోని మరో రహదారిలో సమీప ప్రాంత ఇళ్ళ యజమానులకు రాకపోకలను నిషేధించే దిశగా రహదారిపై శాశ్వత నిర్మాణాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే ఒక వర్గానికి మరో వర్గం నుంచి బెదిరింపులు తీవ్రతరం అయినట్లు తెలుస్తోంది. బెదిరింపులకు గురైనట్లుగా బావిస్తున్న కొందరు తాజాగా అదే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద నడిగడ్డ రహదారుల అంశం చిలికి చిలికి గాలి వానగా మారుతూ ఏలాంటి మలుపులు తిరుగుతుందోనని ఆ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular