కరువు ప్రాంతమైన కోసిగి మండలంలో ఈ సంవత్సరం వర్షాలు సరిగా లేక నీటి శాతం అత్యల్పంగా నమోదు కావడంతో ప్రభుత్వం ముందు చూపుగా తుంగభద్ర నది నుంచి త్రాగునీటి కోసం పైపుల ద్వారా మండలంలోని చెరువులను కేవలం వేసవిలో తాగు నీటి కోసమని నింపి సాగు కోసం నీరు సరఫరా చేయకుండా ఉండటంతో చాలామంది రైతులు రబీలో పంటలు వేయకుండా వలస వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే కోసిగి మండలంలోని దుద్ధి చెరువు నుండి 8 కిలో మీటర్ల దూరం లో ఉన్న చిర్తనగల్లు గ్రామంలోజరిగే పండగ కోసం గత రెండు రోజుల నుంచి నీటిని కాలువల ద్వారా పారించడంతో చెరువు కాస్త ఖాళీ అయింది. కేవలం త్రాగునీటి కోసమని ప్రభుత్వం నింపిన నీటిని ఇలా వృదా చేయడం జల వనరుల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా కనబడుతుంది. రాబోయే వేసవిలో నీటి ఎద్దడిని ఎలా తట్టుకోవాలి అని ఉన్న నీటిని ఇలా వృధా చేయడంతో వేసవిలో తాగడానికి నీటిని ఎక్కడినుండి తీసుకొస్తారు అంటూ మండల ప్రజలు ఆవేశపడుతున్నారు. అధికారులు లంచానికి నీటిని అమ్ముకున్నారా లేక రాజకీయ ఒత్తిడితో ప్రజలు గొంతులు మాడుస్తున్నారా అన్న సందేహం వెలబడుతుంది. ఇష్టా రాజ్యంగా వ్యాహరించే జలవనరుల అధికారులపై సంబంధిత ఉన్నత అధికారులు స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.
ధారాళంగా నీటి వృధా…దుద్ది చెరువు ఖాళీ
RELATED ARTICLES