

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
భద్రాచలం నియోజకవర్గం | 04-04-2025
దుమ్ముగూడెం మండలంలోని లక్ష్మినగరం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సరస్వతీ దేవి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని, తన చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్య యొక్క ప్రాముఖ్యతను ప్రతిపాదిస్తూ, బాలల బుద్ధివృద్ధికి మరియు విద్యాభివృద్ధికి సరస్వతీదేవి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.