Sunday, June 1, 2025

జనసేన క్రియాశీల సభ్యత్వం తీసుకున్న సభ్యులకు ఐడి కార్డుల పంపిణీ

ఆళ్లగడ్డ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ క్రియాశీల  సభ్యత్వాలు చేసిన వాలెంటర్ లకు సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ఐడి కార్డులు, కిట్లను అందజేసిన ఆళ్లగడ్డ జనసేన పార్టీ సమన్వయకర్త మల్లయ్య. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న జనసైనికులకు ప్రమాద రూపంలో గాయపడిన 50 వేల రూపాయల బీమా, ప్రమాదంలో మరణించిన 5 లక్షల రూపాయల  బీమాను పవన్ కళ్యాణ్ గారు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. 2025 సంవత్సరంగాను జూన్ నెలలో సభ్యత్వ కార్యక్రమాన్ని చేపడుతున్నామని కనుక అభిమానులు, జనసేన కార్యకర్తలు జనసేన పార్టీ సభ్యుడిగా చేరి జనసేన పార్టీ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా తెలియజేశారు. ఆళ్ళగడ్డ నియోజవర్గం లో జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకొని మరణించిన 5 మంది జనసేన కార్యకర్తల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు చొప్పున భీమాను వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగిందని తెలియజేశారు. 2024 సంవత్సరం గాను సభ్యత్వాలలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఆళ్లగడ్డ నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలవడానికి కృషి చేసిన వాలంటరీలకు, సభ్యత్వం తీసుకున్న క్రియాశీల సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు  అడ్వకేట్ చెన్నమ్మ, రాచంశెట్టి వెంకట సుబ్బయ్య, దేవా ఆంజనేయులు, భూమా మహేష్ రెడ్డి, బ్రహ్మేంద్ర కుమార్, కోటి , రాజారాం , రమణచారి, చైతన్య, కేశవ, గురుగు సుబ్బయ్య, ఫరూక్ భాష, బండి సుబ్బయ్య, ఆకుల సురేంద్ర, ప్రతాప్, రామయ్య, మైలారు శ్రీను, మహ్మద్ రఫీ, దవనం నరసింహ, లోకేష్ గౌడ్, సుధాకర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular