TEJA NEWS TV : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ జ్యోతి పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు నాగభూషణం తెలిపారు. నిజాంసాగర్ మండలంలోని కోమలంచ గ్రామంలో బుధవారం లబ్ధిదారులకు గృహజ్యోతి పథకంలో జీరో బిల్లును అందజేశారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు ప్రమోద్, రామానాయుడు, సాయి, కాంగ్రెస్ నాయకులు కాలిక్, నారాయణ, సిద్దు, కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
గృహ జ్యోతి పథకంలో జీరో బిల్లు అందజేత
RELATED ARTICLES