Monday, June 30, 2025

కెనాల్ కాలువపై అక్రమ వెంచర్ నిర్మాణాలు – ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆగ్రహం

TEJA NEWS TV: ఆళ్లగడ్డలో శిల్పా వెంచర్ నిర్వాహకులు కేసీ కెనాల్ కాలువ భూములపై అక్రమంగా వెంచర్లు మరియు భవన నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపిస్తూ, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కర్నూల్ జిల్లా పరిషత్ సమావేశంలో మాట్లాడిన ఆమె – ఈ అక్రమ నిర్మాణాల వల్ల 7 ఎకరాల భూములకు నీరు వెళ్లడం ఆగిపోయిందని, రైతులకి నష్టమైతుందని పేర్కొన్నారు.

ఈ విషయంపై అసెంబ్లీలోనూ చర్చ జరిగిందనీ, హైకోర్టు నుండి ఆదేశాలు తీసుకురావడం జరిగిందని తెలిపారు.

శాసనసభలో గళమెత్తిన అఖిలప్రియ, అక్రమ వెంచర్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular