TEJA NEWS TV
శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలంలోని జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకం ద్వారా జాబ్ కార్డులు పొందిన కూలీలు ఫీల్డ్ అసిస్టెంట్ చేత ఈ కేవైసీ చేయించుకోవాలని ఏపీవో జగదీష్ తెలిపారు.కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ చేయించుకుంటేనే ఉపాధి పనులు చేసేందుకు అవకాశం ఉందన్నారు. ఈ కేవైసీ చేయించుకోలేకపోతే ఉపాధి పనులకు అనర్హులని తెలిపారు.ఈ అవకాశాన్ని కూలీలు ఈ కేవైసీ చేయించుకుని ఉపాధి హా మీ పథకాన్ని కూలీలు సద్వినియోగం చేసుకోవాలని,ఈ నియమాన్ని తూ..చా..తప్పకుండా పాటించాలని ఏపీవో సూచించారు.
ఉపాధి కూలీలు ఈ కేవైసీ చేయించుకోండి ఎపిఒ జగదీష్
RELATED ARTICLES



