
ఆళ్లగడ్డ పట్టణంలోని భూమా కిషోర్ రెడ్డి కార్యాలయంలో ఆదివారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వైసీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా భూమా కిషోర్ రెడ్డి కార్యకర్తలు అందరి సమక్షంలో జగన్ కు ఫోన్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలువురు వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు



