Sunday, January 11, 2026

అన్నప్రసాద వితరణ కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ


కొత్తగూడెం:

కొత్తగూడెం పట్టణంలో అన్నపూర్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈరోజు ఘనంగా జరిగింది. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవా కార్యక్రమానికి తమ మద్దతు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తూము చౌదరి, కోనేరు చిన్ని కలిసి అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ—

భవిష్యత్తులో ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజున ఈ సేవా కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహిస్తామని,

ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.


కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:

కాంగ్రెస్ పార్టీ నాయకుడు పూణెం శ్రీనివాస్

మైనారిటీల జిల్లా కార్యదర్శి MD. గౌస్ పాషా

దళిత హక్కుల నాయకులు అంతడపుల కృష్ణ

మాజీ సర్పంచ్ బండ వెంకటేశ్వర్లు

MD. అయబ్ ఖాన్

బహుజన నాయకులు ఉయ్యూరు శ్రీను

మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు.


స్థానికంగా సేవా కార్యక్రమాల పట్ల ప్రజలు ప్రశంసలు వ్యక్తం చేస్తూ ట్రస్ట్ నిర్వహణను అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular