Tuesday, September 16, 2025

అధికార పార్టీకి కొమ్ముకాస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూన్న RJD ప్రతాప్ రెడ్డిని సస్పెండ్ చేయాలి

TEJA NEWS TV:

అధికార పార్టీకి కొమ్ముకాస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూన్న RJD ప్రతాప్ రెడ్డిని సస్పెండ్ చేయాలి,

ఏఐఎస్ఎఫ్ నాయకులపై లాఠీచార్జి చేసి గాయపరిచిన ఆదోని వన్ టౌన్ సిఐ విక్రమ సింహను సస్పెండ్ చేయాలి,

కోసిగి మండలం ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో ఏఐవైఎఫ్ మంత్రాలయం తాలుక ప్రధాన కార్యదర్శి ఏమ్.రాజు ఏఐఎస్ఎఫ్ మంత్రాలయం తాలుక అధ్యక్షుడు ఎస్.ఈరేష్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారి అయిన RJD ప్రతాప్ రెడ్డి అధికార పార్టీకి కొమ్ముకాస్తూ ఆదోని జ్యోతిర్మయి కాలేజీలో HM’s ,MEO’s ల మీటింగ్ పెట్టి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉంటే ఆధారాలతో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు సమావేశాన్ని అడ్డుకోవడం జరిగిందని అన్నారు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం విరుద్ధంగా ప్రభుత్వ అధికారులు ఎన్నికల ప్రచారం నిర్వహించడం ఏంటి అని ప్రశ్నించినందుకు ఏఐఎస్ఎఫ్,ఏఐవైఎఫ్ నాయకుల పైన పోలీస్ లు లాఠీ ఛార్జ్ చేయడంతో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సోమన్న కంటికి బలమైన గాయం అయింది అయినప్పటికీ పోలీస్ యంత్రాంగం విద్యార్థులని చూడకుండా దుర్మార్గంగా చొక్కాలు పట్టుకొని ఈడ్చుకుంటూ వారిని రౌడీల్లా లాకెలుతు అరెస్టు చేయడం జరిగింది అన్నారు నిరసనలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు రంగన్న, సుదర్శనం, జిల్లా సహయకర్యధర్శులు షాబీర్ భాషా, విజయేంద్ర జిల్లా ఉపాధ్యక్షులు శరత్,థామస్,పాటు మరికొంతమందిని విద్యార్థి సంఘం నాయకులను దుర్మార్గంగా అరెస్టు చేయడం జరిగింది అన్నారు ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులపై లాఠీచార్జి చేసి గాయపరిచిన ఆదోని వన్ టౌన్ సిఐ విక్రమ సింహను సస్పెండ్ చేయాలని, డిమాండ్ చేశారు అలాగే ప్రభుత్వ ఆధికారి అయిన RJD ప్రతాపరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేయడం చట్ట వ్యతిరేకం కావున అతన్ని వెంటనే సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు , అక్రమంగా అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం అవుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఏఐవైఎఫ్ నాయకులు జీవన్ మహేష్ హనుమంతు అశోక్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular