Thursday, May 22, 2025

స్వంత గూటికి చేరిన తెలుగుదేశం పార్టీ మాజీ MPP గజ్జహళ్లి సిద్దప్ప

TEJA NEWS TV

హొళగుంద మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ,మాజీ మండల కన్వీనర్ అయిన గజ్జహళ్లి సిద్దప్ప గారు బుధవారం ఆలూరు టిడిపి కార్యాలయంలో ఆలూరు టిడిపి ఇంచార్జ్ వీరభద్రగౌడ్ గారి సమక్షంలో పెద్దఎత్తున అనుచరగణంతో కలిసి తమ స్వంత గూడైన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకొన్నారు.

ఆలూరు టిడిపి ఇంచార్జ్ వీరభద్రగౌడ్ గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గజ్జహళ్లి సిద్దప్ప  పార్టీ కొరకు విశిష్ట సేవలను అందించారని వారి పునః ఆగమనం తెలుగుదేశం పార్టీకి మరింత బలాన్ని చేకూర్చిందని తెలిపారు, నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సువర్ణ పాలన ప్రజల మన్ననలను పొందుతూ సంక్షేమ పారదర్శకతలతో రాష్ట్ర ప్రజానికానికి మరింత చేరువవుతుందన్నారు. అలాగే తన స్వంత మండలమైన హొళగుందలో టిడిపి బలోపేతానికి ప్రత్యేక చొరవ చూపుతామన్నారు.

ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ తిప్పయ్య, సీనియర్ నాయకులు ఎల్లార్తి మల్లికార్జున, తోక వెంకటేష్, మాజీ ఎంపీటీసీ కూడ్లుర్ ఈరప్ప, నాయకులు ఐకల్ అయ్యప్ప, దమ్ముల తిక్కస్వామీ,కన్నయ్య,చాకలి భద్రి, మంగలి సంజీవ్,కొరివి సాయిబెష్, తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular