సంగెం మండలంలోని తీగరాజుపల్లి గ్రామ శివారులోని నెక్కొండ – వరంగల్ ప్రధాన రహదారిపై గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్డుపై నీరు ఆగి, రహదారి దెబ్బతినడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఈ కారణంగా వాహనదారులకు ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఈ పరిస్థితిని గుర్తించిన సంగెం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కుమారస్వామి సూరి తన సొంత స్ఫూర్తితో రోడ్డుపై గుంతలను పూడ్చి వాహనదారులకు సహాయపడ్డారు. ఆయన చేసిన ఈ సామాజిక సేవా కార్యక్రమాన్ని స్థానికులు మరియు ప్రయాణికులు అభినందిస్తూ సెల్యూట్ చేస్తున్నారు.
సామాజిక స్పూర్తికి ప్రజలు సెల్యూట్ – కానిస్టేబుల్ కుమారస్వామి సూరి సేవాభావం
RELATED ARTICLES



