మక్తల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో గత 30 సంవత్సరాలుగా రాజకీయంగా ప్రజలకు సేవలు అందిస్తూనే అనేక సామాజిక, సహాయక కార్యక్రమాలు చేపడుతూ ప్రమాదాలలో గాయపడిన వారిని తన చేతులతో తన వాహనంలో ఎక్కించుకొని మరి ఆసుపత్రులకు తీసుకువెళ్లి సొంత ఖర్చులతో వైద్యం చేయించడం ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు వెళుతున్న మన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి డాక్టరేట్ పురస్కారం లభించింది. గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వర్చ్యువల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాండిచ్చేరి వారిచే డాక్టరేట్ పురస్కారాన్ని శనివారం తమిళనాడు రాష్ట్రంలోని పాండిచ్చేరిలోనీ కంబన్ కళారై ఆరాగం వేదికగా జరిగిన కార్యక్రమంలో మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి సేవా రంగానికి సంబంధించిన డాక్టరేట్ను అందుకున్నారు. పాండిచ్చేరిలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ వాకిటి శ్రీహరి తెలుగులో ప్రసంగించడం పట్ల ఎమ్మెల్యే గారితో ఫోటోలు దిగేందుకు అక్కడి ప్రముఖులు పోటీపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన జీవిత కాలంలో చివరి అంకం వరకు ప్రజా శ్రేయస్సు కోసమే పాటుపడతానని ప్రకటించారు. తన సేవా కార్యక్రమాలను గుర్తించి తనకు డాక్టరేట్ ను అందించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టరేట్ అందుకున్న మక్తల్ ఎమ్మెల్యే శ్రీ వాకిటి శ్రీహరిని ఈ సందర్భంగా మక్తల్ నియోజకవర్గ ప్రజలు, ఆత్మకూరు మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ మండల అధ్యక్షుడు ,ఆత్మకూరు టౌన్ అధ్యక్షుడు, వివిధ కాంగ్రెస్ పార్టీ కుల సంఘాల అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు.
సామాజిక సేవా కార్యక్రమాలతో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి డాక్టరేట్ అవార్డు
RELATED ARTICLES