Monday, January 20, 2025

సమన్వయంతో పనిచేసి బిజెపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి -డా.పగడాల కాళీ ప్రసాద్ రావు





*తేజ న్యూస్ టివి ప్రతినిధి. సంగెం.*

భారతీయ జనతా పార్టీ జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమ వర్క్ షాప్ ను సంగెం మండల కేంద్రం లోని గంగా పుత్ర బెస్త కమిటీ  హాల్ లో సోమవారం రోజు నిర్వహించడం జరిగింది.. ఇట్టి సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు*
మరియు వరంగల్ జిల్లా ఉపాఅధ్యక్షులు పగడాల రాజకుమార్ సంగెం మండల క్రియ శిలా సభ్యత్వ ఇంచార్జి నార్మెట్ట శ్రీనివాస్ గౌడ్ , సంగెం మండల అధ్యక్షులు బుట్టి కుమారస్వామి  ఆధ్వర్యంలో బీజేపీ పరకాల నియోజకవర్గం ఇంచార్జి డాక్టర్ కాళీ ప్రసాద్  హాజరై మాట్లాడుతూ సెప్టెంబర్ 13తేది నుండి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు మొదలవుతాయని  భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ సమన్వయంతో పనిచేసి వరంగల్ జిల్లాలో అధిక సంఖ్యలో సభ్యత్వాలు చేయాలన్నారు… 100 ఒక్కొక్క బూత్లో అధ్యక్షులు100-200 సభ్యత్వాలు చేసిన వారికే క్రియాశీల సభ్యత్వం వస్తుందని క్రియాశీలక సభ్యత్వం వచ్చిన వారికే మండల, జిల్లా స్థాయిలో పదవులు వస్తాయని కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి పోలింగ్ బూత్ లో సభ్యత్వాలు చేయాలన్నారు*
ఈ కార్యక్రమం లో మాజీ ఎంపిటిసి యాదగిరి రావు బీజేపీ సంగెం మండల ప్రధాన కార్యదర్శి భూక్యా వెంకన్న మరియు మాజీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బెజ్జంకి శేషాద్రి,పరకాల నియోజకవర్గం అసంబ్లీ కన్వీనర్ ముల్కప్రసాద్ సహాయ ప్రముఖ్ జక్కా చేరలు, శేక్తి కేంద్ర ఇంచార్జి లు, బూత్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular