Monday, February 10, 2025

సంగెం మండలం కుంటపల్లి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

హనుమకొండ భవాని నగర్ లోని పరకాల శాసనసభ్యులు  రేవూరి ప్రకాశ్ రెడ్డి  నివాసంలో సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంగెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చోల్లేటి మాధవరెడ్డి అధ్యక్షతన మండల సీనియర్ నాయకులు గుమ్మడి హరిబాబు, అచ్చ నాగరాజు, జున్న కొమురుమల్లు సమక్షంలో కుంటపెల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెంతల ప్రతాప్ ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో బీ ఆర్ ఎస్ పార్టీకి చెందిన ఎలుగోయ లింగయ్య జున్న దేవేందర్ గోపతి మల్లయ్య పెంతల సంపత్ ఎరుకల కుమారస్వామి ఎరుకల శంకర్ లింగం పెంతల మోహన్ కరుదురి కుమారస్వామి గోనె కొమురయ్య వీరితోపాటు 50 మంది కి పరకాల ఎమ్మెల్యే  రేవూరి ప్రకాశ్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో కుంటపల్లి గ్రామ నాయకులు జున్న యాకయ్య ఉపాధ్యక్షుడు జున్న రమేష్ జక్క శ్రీనివాస్ కావట్టి రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular