Saturday, January 18, 2025

సంగెం: గ్రామాలలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి – ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి

తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం

గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి కృష్ణ నగర్ , షాపురం గ్రామలలోబోర్ మరియు పైప్ లైన్ పనులను ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి,చొల్లేటి మాధవరెడ్డి తో కలిసిప్రారంభించినారు.ఈ సందర్భంగా ఎంపీపీ, మాట్లాడుతూ షాపురం గ్రామంలో మంచినీటిపనుల కొరకు పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి (ఎస్ డి ఎఫ్) నిధులు విడుదల చేసి 4 లక్షలు మంజూరీ చేయించినారు.అట్టి నిధులతో గ్రామంలో బోర్ వేసి పైప్ లైన్ పనులనుచేయించడం జరుగుతుంది అని అన్నారు.మరియు కృష్ణ నగర్ గ్రామంలో 1లక్ష ,మండల పరిషత్ నిధులతో బోర్ పనులకు నిధులను మంజూరీ చేయించినారు అని అన్నారు.ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సంగెం మండలంలోని అన్ని గ్రామాలలో మంచినీటి కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బొమ్మ పావని యుగేందర్ ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,జనగాం రమేష్ కాంగ్రెస్ అధికార ప్రతినిది, మండల కాంగ్రెస్ నాయకులు మడత కేశవులు,ఇండ్ల రవి,విలాసాగరం వెంకటేశ్వర్లు, బండి రాధిక,షాపురం కాంగ్రెస్ అధ్యక్షలు దోనికల శ్రీను , సమ్మారావు, ఆంజనేయులు శ్రీహరి, రాజు ఎక్స్ సర్పంచ్, కృష్ణ నగర్ దుడ్డు రాజు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, గోపతి రవి,గోపతి కట్టయ్య,మేకల చంద్ర మౌళి, మేకల ఓదెలు,ఇమ్మడి రవి, గోపతి రమేష్ సారయ్య మేకల బుచ్చయ్య, మేకల కట్టయ్యగోపతి స్వామి,, దుడ్డు ఎల్లయ్యపోల్గొన్నారు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular