Monday, February 10, 2025

షేమిమ్ బేగం ఆధ్వర్యంలో కన్నుల పండుగగా మహిళలకు ముగ్గుల పోటీలు

డోన్ పట్టణంలోని శ్రీరామనగర్ కాలనీ నందు ఆంధ్రప్రదేశ్ మహిళ సమాఖ్య నంద్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్. షేమిమ్ బేగం ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు.
ఈ ముగ్గుల పోటీలలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ముగ్గులను వేశారు.

ఈ పోటీలకు ముఖ్య అతిదులుగా డోన్ డీఎస్పీ శ్రీనివాసులు సతీమణి షీలా సౌజన్య, రూరల్ సీఐ రాకేష్ సతీమణి మాధవి లు హాజరై న్యాయ జడ్జీలుగా వ్యవహరించారు.

ఈ ముగ్గుల పోటీలలో మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి న్యాయ నిర్ణేతలు మొదటి విజేతగా కావ్య (బహుమతి కుకుమా భరణీలు),రెండవ విజేతగా అనిత(బహుమతి గ్రైండర్), మూడవ విజేత నవీన (కిచెన్ సెట్) లను ఎంపిక చేసి బహుమతులను అందజేశారు.

ఈ సందర్భంగా న్యాయ నిర్ణేతలను షేమిం వారి మిత్ర బృందం శాలువాలు మేమంటోలతో సత్కరించారు.

ఈ ముగ్గుల పోటిలతో శ్రీరామ్ నగర్ కాలనీ అంత పండుగా వాతావరణంతో ఆహ్లాదకరంగా మారింది.

ఈ సందర్భంగా న్యాయ నిర్ణేతలు మాట్లాడుతూ డోన్ పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఈ పోటీలను నిర్వహించి ఇంత పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగను కళ్ళకు కట్టినట్లు చూపించే ముగ్గులను వేసిన మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పోటీలను నిర్వహించిన షేమిమ్ వారి మిత్ర భృందన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ మహిళ నాయకులు అమృత రెడ్డి,శిరిన్,మాధవి,షబానా, సూర్య పద్మావతి,మాధవీలత, డోన్ పట్టణ మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular