
తేజ న్యూస్ టివి ప్రతినిధి.
వరంగల్ చారిత్రాత్మక దేవాలయం వెయ్యి స్తంభాల గుడి కుడా గార్డెన్ లో తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి, ధన్వంతరి సేవా సమితి సంయుక్త నిర్వహణలో శ్రీ శంకరాచార్య, శ్రీ రామానుజాచార్యుల జయంతి సందర్భంగా వరంగల్ కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ గారు, ధన మంత్రి సేవా సమితి అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆచారి తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కుడా ఛైర్మన్ మాట్లాడుతూ అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలు, హిందూధర్మ పరిరక్షణకు వారు చేసిన సేవలు అమోఘమన్నారు. వారు చూపిన బాటలో పయనించాలని కోరారు. అనంతరం బ్రాహ్మణులను సత్కరించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు వెంకట సత్యమోహన్ శర్మ , ప్రముఖ సంస్కృత పండితుడు శ్రీమాన్ సముద్రాల శఠగోపాచార్యులు, బ్రాహ్మణులు, వైష్ణవులు మహిళలు పాల్గొన్నారు.