Thursday, January 16, 2025

వినూత్న ఆగ్రోటెక్ సూచనలుసలహాలు పాటించండి…. అధిక పంటల దిగుబడి సాధించండి

నేల సారవంతం సేంద్రియ ఎరువులతోనే సాధ్యమని
అధిక పంటల దిగుబడి పెంచడానికి రైతన్నలు సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని వినూత్న ఆగ్రోటెక్ ఎల్ఎల్ పి మార్కెట్ డెవలప్మెంట్ ప్రతినిధులు బిల్లా రాజేష్ యాదవ్ ఏ ఎస్ ఎం బాబు , ఎస్ మోహన్ , ఎఫ్ ఏ, శంకర్ లు అన్నారు. మంగళవారంఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని చాగలమర్రి మండలం కెపి తాండ గ్రామంలో వినూత్న ఆగ్రోటిక్ ఎల్ ఎల్ పి సంస్థ  ఆధ్వర్యంలో సంస్థ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాజేష్ యాదవ్ సారధ్యంలో రైతులకు సేంద్రియ ఎరువులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు సదస్సులో వారు మాట్లాడుతూ పంట సాగులో రసాయనిక ఎరువులు ఆధికంగా వాడడం వల్ల ఆహార ఉత్పత్తులు విషతుల్యం  ఆవుతున్నాయి. రసాయన ఎరువులు వాడకం వల్ల క్రమక్రమంగా భూమిలో భూసారం తగ్గిపోయి, పంట దిగుబడులు తగ్గిపోతాయి. మానవ జంతువాళికి ముప్పును కల్పిస్తాయి. పర్యావరణ కలుష్యాన్ని పెంచుతాయన్నారు. సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువులు గురించి వివరించారు.సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువులు వాడడం వల్ల పెట్టుబడులను తగ్గించుకోవచ్చు అన్నారు. అలాగే అధిక దిగుబడులను సాధించ వచ్చు అన్నారు . “వినూత్న ఆగ్రో టెక్ ఎల్.ఎల్.పి” వారి రైతులకు అందించే సేంద్రీయ జీవన ఎరువులైనా “యోధ సేంద్రియ ఎరువులు, యోధ సి ఎం ఎస్ జీవన్ గోల్డ్,  రైతుమిత్ర, ప్రణయ్,  గ్రో హై గ్రాన్యూల్స్,  గ్రో హై లిక్విడ్,  డెల్టా ప్రో,  తులిప్,  యువరాజ్, డైనమైట్, జనని, ట్రిగర్ , టర్బో  కే జి ఎఫ్6, రోషిని, ఉజ్వల్ , త్రిసూల్, ధర్మవీర్ ,  రత్నా,  పృధ్వీరాజ్, తిరంగా,  నైట్స్,  త్రిలోక్,  ఇగ్నిస్ 5  అవనీ న్యూట్రిన్, అవనీ గోల్డ్, అవనీ జింక్ ప్లస్ (జెడ్33%+ఎస్15%), అవనీ న్యూట్రిసోల్ కే ఎం ఎస్-22.18.20), అవనీ కాబన్, అవనీ సీ గోల్డ్ (పౌడర్/గ్రానువాల్స్) , అవనీ సీ గోల్డ్ (లిక్విడ్), అగ్ని, విభా ప్లస్, వాల్ట్, ధన్వి , వాల్ యు ప్యాక్, టిల్లరింగ్ బోస్టర్, సాయిల్ రిసువేటర్,  లను పంటకు వాడి భూమిలోని మిత్ర పురుగులు అయినటువంటి సూక్ష్మజీవులను అభివృద్ధి చేసి మొక్కలకు కావాలసిన పోషకాలను అందించి మొక్కలలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని రైతులకు తెలిపారు. “వినూత్న ఆగ్రో టెక్ఎల్.ఎల్.పి.” సంస్థ గత 2 సం॥రాలుగా సేంద్రీయ, జీవన ఎరువులను అందిస్తూన్నారు. పలు గ్రామాల్లో సేంద్రీయ జీవన ఎరువులపై “రైతు అవగాహన సదస్సు ” కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, రైతు సోదరులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular