Wednesday, January 22, 2025

వరిలో ఆకు ఎండు తెగులు  నివారణ

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం మల్కాపూర్ గ్రామంలో కామారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, వరి పొలాలను సందర్శించడం జరిగింది. వాతావరణ మార్పుల వల్ల వరిలో బాక్టీరియా ఆకు ఎండు తెగులు గమనించడం జరిగింది. దీని నివారణకు ” స్ట్రెప్టోమైసీన్ సల్ఫేట్ 9% శాతం అన్న” – 100 శాతం గ్రాములు లేదా వలిడామైసీన్ 3%  శాతం ఎల్  – 500 మీ.లీ ఎకరానికి చొప్పున పిచికారీ  చేసుకోవాలి. అలాగే చాలా చోట్ల ముందుగా నాటిన వరి పంటలు  పొట్ట దశలో ఉన్నాయి. ఆఖరి దఫాగా వేసే ఎరువులు వేసే మూడు రోజుల ముందు లేదా మూడు రోజుల తరవాత ” కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 75% శాతం ఎస్. జి  200 గ్రాములు మరియు (పికక్సీస్ట్రోబిన్ + ట్రైసైకలజోల్)- 400 మీ.లీ. మందులు పిచికారి చేసినట్లయితే తెల్ల కంకి మరియు మెడ కాటు రోగాలను నివారించి వరిలో దిగుబడి పెంచవచ్చని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ  రాఘవేంద్ర, మరియు మల్కాపూర్  రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular