Monday, January 20, 2025

రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయండి

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం ధాన్యం కొనుగోలు కేంద్రంలో  జిల్లా కలెక్టర్ చంద్రమోహన్ పరిశీలించి తూకం వేసి సిద్ధంగా ఉంచిన ధాన్యం బస్తాలను వెంటనే తరలించాలని ఇందుకు అవసరమైన లారీలను కేంద్రంలో పంపాల్సిందిగా ట్రాక్టర్ లో ఆదేశించారు. ముందుగా బీబీపేట మండలంలో కొనుగోలు కేంద్రాలను సంబంధించిన ధాన్యం తేమ శాతాన్ని కొలిసి తుకం చేసే ప్రక్రియను పరిశీలించారు. కేంద్రాల్లో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని అవసరమైన గన్నీ సంచులు అందుబాటులో ఉంచాలని వెంట వెంటనే తరలిస్తూ మిల్లర్ కూడా 24 గంటల్లో దాన్యం దించుకునేలా పర్యవేక్షించాలని ఎంట్రీ చేయాలని అధికారులకు సూచించి రైస్ మిల్లు కూడా హమాలి కూలీలను ఎక్కువగా పెట్టుకొని లారీలు వచ్చి ధాన్యం దించుకోవాలని, పిల్లల వద్ద లారీలు వచ్చి ఉండరాదని త్వరగా తిరిగి లోడింగ్ వెయ్యడానికి అవకాశం ఉన్నట్టు చేశారు. అకాల వర్షాల వల్ల ధాన్యం కాస్త చెడిపోయిన రైతుల పరిస్థితులను అర్థం చేసుకొని ప్రభుత్వం ఆదేశాల మేరకు ధాన్యంలో వెంటనే కోత విధించకుండా అన్లోడ్ వేసుకొని ట్రాక్ పేస్ట్ జారీ వెయ్యాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫల అధికారి మల్లికార్జున బాబు , ఇన్చార్జి జిల్లా మేనేజర్ నిత్యానందం, డిప్యూటీ ఎమ్మార్వో తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular