Thursday, May 22, 2025

రెండు నెలలైనా రైతు బీమా అందలేదంటూ…. భగ్గుమంటున్న బీఆర్ఎస్ నాయకులు

రెండు నెలలైనా చనిపోయిన రైతు కుటుంబానికి రైతు బీమా పథకం డబ్బులు అందలేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు సోమవారం మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల ప్రధాన కార్యదర్శి దేవునిపల్లి శ్రీనివాస్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర సర్కారు టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రైతు నాయకునిగా ఒక రైతుబిడ్డగా అడుగడుగునా రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టిన పథకాలలో రైతును గుండెలో పెట్టుకొని రైతు బాధను స్వయంగా చూసిన నాయకునిగా ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలలో ఒకటైన రైతు బీమా పథకం దేశంలో ఎక్కడ లేని విధంగా ఆయన ప్రవేశపెట్టి ప్రమాదవశాత్తు మరణించిన రైతు కుటుంబానికి వారం రోజుల్లోనే ఐదు లక్షల ఎల్ఐసి ద్వారా ఇన్సూరెన్స్ ప్రీమియం తన ప్రభుత్వం ద్వారా చెల్లించి బాధలో ఉన్న ఆ రైతు కుటుంబం రోడ్డున పడకుండా ఆ రైతు పెద్ద కొడుకు గా ఉండి ఆ కుటుంబానికి చేయూతగా నిలిచాడు అన్నాడు. అలాంటి బృహత్వమైన పథకాన్ని  నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓ రైతు ప్రమాదవశాత్తు చనిపోతే 45 నుంచి 60 రోజులైనా అట్టి రైతుకు నేటి సర్కారు అలాంటి రైతు బీమాను అందించకుండా   అలాంటి కుటుంబాలకు అగమ్య గోచరంగా తిప్పలు పెడుతున్నారని ఆయన అన్నారు రైతులు వ్యవసాయ పెట్టుబడి, బోరు బావులు ఏర్పాటు చేసుకోవడం వంటి వాటితో అప్పుల పాలై  గుండె పోటులు, ఆకస్మిక మరణాలు చెందుతున్న కుటుంబాలను ప్రభుత్వం ప్రీమియంలు చెల్లించి ఎల్ఐసి ల ద్వారా రైతు బీమా వంటి పథకాలతో ఆదుకోవాల్సింది పోయి రైతులను వారి కుటుంబాలను ఇలా తిప్పలు పెట్టడం సరియైన పద్ధతి కాదంటూ ఆయన ఎద్దేవా చేశారు గత ప్రభుత్వంలో వారం రోజుల కాల వ్యవధిలో చెల్లించిన రైతు బీమా నేడు 60 రోజులైనా ఆ కుటుంబానికి అందడం లేదు ఎందుకని ప్రశ్నించారు, ఎద్దేడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన దేశం ఎప్పుడు సస్యశ్యామలంగా ఉండదని ఆయన అన్నారు ఏదైనా రాజకీయపరమైన కోపతాపాలుంటే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన చూపెట్టాలి కానీ ఏ తప్పు చేయని రైతుల పైన రైతు కుటుంబాల పైన చూపడం సరైన పద్ధతి కాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వివరించకుండా జిల్లా యంత్రాంగాన్ని గాడి తప్పకుండా చూసి సరిగా పాలన ప్రజలకు అందేలా చూడాలని వారం రోజుల్లో రైతు కుటుంబాల ఖాతాలలో డబ్బులు పడేలా చేయాలని వారు డిమాండ్ చేశారు లేనియెడల బీఆర్ఎస్ పార్టీ ముందుండి రైతుల తరఫున జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ప్రభుత్వానికి తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బత్తిని జనార్ధన్, మాజీ పార్టీ మండల అధ్యక్షుడు ధర్మగారి రాజా గౌడ్, ఎర్రగుళ్ల బాబు, యూత్ నాయకులు దాయరి రంజి, తదితరులున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular