Friday, July 11, 2025

యువత రాజకీయాల్లోకి రావాలి – టిపిసిసి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి

TEJA NEWS TV TELANGANA
బీబీపేట్.      మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో యువత రాజకీయాల్లోకి రావాలి టీపీపీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు ఇంద్రకరణ్ రెడ్డి కి టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా పదవి వరించడంతో బిబిపేట మండలం యూత్ అధ్యక్షుడు మల్లుగారి మహేష్ సోమవారం రోజు ఆయనను కలిశారు అనంతరం ఆయనకు  శాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో యువత పాత్ర కీలకం కాబోతుందని తెలిపారు  ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్య రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి అన్నారు యువత రాజకీయాల్లోకి వచ్చి నిజాయితీ కలిగిన నేతలుగా ఎదురుగాలని సూచించారు రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించి అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మండల్ యూత్ అధ్యక్షుడు మల్లు గారి మహేష్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పరకాల రవి సీరిబీబీపేట్ ప్రెసిడెంట్ నాగరాజు జనగామ యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్ ఇసనగర్ యూత్ ప్రెసిడెంట్ కనకరాజు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular