Saturday, January 18, 2025

యాడవరంలో విజ్ఞాపన ర్యాలీ విజయవంతం

కేటీఆర్ త్వరలో బీబీపేట మండల్ కోనాపూర్ గ్రామంలో వారి నాయనమ్మ జ్ఞాపకార్థం నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించేందుకు వస్తున్న నేపథ్యంలో..
గత మూడు సంవత్సరాల క్రితం బిబిపేట పాఠశాల భవనాన్ని ప్రారంభించే క్రమంలో బిబిపేటకు జూనియర్ కళాశాలను ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి ప్రకటించిన హామీ అమలుకు నేరవేరలేదని.. కావున తన పర్యాటనకు ముందే జూనియర్ కళాశాల తరగతులు ప్రారంభించాలని విద్యార్థులతో కలిసి *కేటీఆర్ కి విజ్ఞాపన ర్యాలీని నిర్వహించడం జరిగింది*
అనంతరం నాయకులు మాట్లాడుతూ… ముగ్గురు మంత్రులు హామీ ఇచ్చిన అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు కావున వెంటనే కళాశాల తరగతులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పిడుగు శ్రీనివాస్, భారత్రాజు, మహేందర్ వర్మ, రాకేష్ గౌడ్, సతీష్, అందే మధు, కుమార్ గౌడ్, కుమ్మరి ప్రవీణ్, యాదగిరి, శ్రీనివాస్ తదితులున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular